ఈ జీవితం చివరి రణ రంగం లో
నా పాపాలన్నింటిని చన్నీళ్ళతో కడిగేసారు .
పతవాన్ని బాగుండగానే
కొత్త బట్టలు తొడిగించారు.
మరణం అనే రధాన్ని
ఎనిమిది కాళ్ళతో
నలుగురు స్వారీ చేస్తున్నారు .
నాపై తెల్లని గుడ్డ కప్పి
మరక లేని మనిషిని చేసారు .
ఏడిచే వాళ్ళు కొందరు ,
ఏడుపు రప్పించే వాళ్ళు ఇంకొందరు .
నన్ను ఇన్నాళ్ళు ఏడిపించిన వాళ్ళు
నాకోసం ఏడుస్తూ
నాకు నవ్వు తెప్పించేలా చేస్తున్నారు .
నేను రానని రాలేనని తెలిసి
నా బందు మిత్రులందరూ నా పేరు ను
పిలిస్తున్నారు.
తలుస్తున్నారు ...
నాకు నిద్ర పట్టదని తెలిసి
కట్టెలపై నే పడుకో బెడుతున్నారు .
నాకు నిప్పంటే భయమని తెలిసీ ,
నిప్పంటిచ్చేస్తున్నారు .
ఒంటరి తనాన్ని భరించ లేనని తెలిసీ,
ఒంటరి గా వదిలేసి వెళ్తున్నారు .
నా నిండు దేహాన్ని
నిర్దాక్షిన్యంగా కాల్చేసి,
బొమ్మకి బొట్టు పెట్టి,
గోడకి తగిలించే ప్రయత్నం చేస్తున్నారు.
నా పునః నామకరణ
మరణ మహోత్సవానికి
పత్రికలచ్చు వేయించి,
అందరిని ఆహ్వానిస్తున్నారు...
No comments:
Post a Comment