20130804

చదువుకోడం


నాకు తెలిసి చదువుకోడం అంటే చాలా కష్టం అని , కానీ అంత కస్టపడి చదివిన నాకు ఆ చదువు ఎందుకు చదివానా అని సిగ్గుగా ఉంది . ఎవడి చరిత్రనో నా నోటితో చదివించి చదివించి , నాకు చరిత్రే లేనట్టుగా  చేసారు .
బందరు వెళ్ళిన నాన్న లు బొమ్మలు తెచ్చారే గని , దుబాయ్ వెళ్ళిన ఎంతో మంది నాన్న లు ఏమి తేలేదేందుకు ?

కృష్ణ దేవరాయల గొప్పదనాన్ని చూసాను గని , నవాబుల నిరకుశత్వాన్ని  నాకెవరు చూపలేదు ?
వికట కవి అని ఉప వాచకాల నిండా ఉంది  కానీ , కాకతీయ రాజుల గురించి వారి సామంతుల గురించి ఎక్కడ లేదు .
హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్న విగ్రహాల గురించి చెప్పారే తప్ప , ఆ సాగర్ ని తవ్విన్చినో డి ని మాత్రం కనీసం తలవనుకుడా తలవలేదు ...
ఎక్కడో ఒంగోలు లో పుట్టిన ప్రకాశం పంతులు మా పుస్తకాలల్లో ప్రాణం పోసుకున్నాడు గని ,ఆదిలాబాద్ లో పుట్టిన  కొమురం భీమ్ మాత్రం పుస్తకాలల్లో ప్రాణం పోసుకోలేదు .

చీరాల పేరాల పోరాటం గొప్పది అయినప్పుడు , జగిత్యాల జైత్రయాత్ర ఎందుకు గొప్పది కాలేదు ?

సర్ అర్ధర్ కాటన్ బ్రిడ్జి గురించి రాసారు గని , శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లేదేమో మరి ?

నా రాష్ట్రము అన్న పూర్ణ అని గోదారి జిల్లాల గురించి చెప్పినప్పుడు , సహజ వనరుల జిల్లాలు ఆదిలాబాద్ , ఖమ్మం ల గురించి చెప్పలేదు .

విజయ వాడ  కనక దుర్గ కి దక్కే గౌరవం , మా బాసర సరస్వతి కి దక్కదు .
ఇంకా వేములాడ రాజన్న , కొండగట్టు అంజన్న లయితే ఆడికాడికే...

జెండా రూపకర్త  గని , ప్రతిజ్ఞ రాసిన నల్లగొండ వాడు మనోడు కాకుండా పోయాడా ?

 నాకిప్పుడే అర్ధం  అయితంది , నేను చిన్నప్పుడు తిన్న జొన్న గడుక ,జొన్న అంబలి ఇప్పుడు ఇడ్లి లుగా  ఎలా మారాయా అని , సింగరేణి బాయి ల మీద ఉన్న పోచమ్మ , మైసమ్మ లు నేడు కనక దుర్గలు గ ఎలా మారారు అని ,
ఆనిక్కాయకు రెండు పేర్లు ఉన్నాయని మురిసి పోయాను గాని , ఇంకో పేరు పరాయోడి పెత్తనపు రుద్దుడని అర్ధం అయింది .

No comments:

Post a Comment